
టెక్నాలజీ

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఇద్దరూ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇటీవల ఇద్దరితో విడివిడిగా ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు. తుర్కియేలో జరగనున్న నాటో సదస్సులో ఈ అంశంపై చర్చించనున్నట్లు వెల్లడించారు.
ఇక రష్యా సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 21 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ తమ ఇంధన కేంద్రాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!