
సినిమాలు

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తన కుమార్తె కేసులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఆ మాట నిలబెట్టుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం బాధాకరమని అన్నారు.
ఇతర కేసుల్లో పోలీసులు వేగంగా స్పందించి భారీ స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారని, అదే స్థాయిలో తమ కుమార్తె కేసుపై దృష్టి పెట్టలేదని పార్వతి ఆరోపించారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొంటూ, తమ కుటుంబానికి కూడా సమాన న్యాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!