

కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజాం పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పంతోనే తెలంగాణకు విమోచనం లభించిందని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసి, ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్న చరిత్ర ఉందని పేర్కొన్నారు. అలాంటి నిజాంను గొప్పవాడిగా చిత్రీకరిస్తూ అసెంబ్లీలో మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. నిజాంను పొగిడే నాయకుల డీఎన్ఏ పరీక్ష చేయాల్సిన పరిస్థితి ఉందని, వారు ఈ దేశ పౌరులేనా లేదా విదేశీ డీఎన్ఏ ఉందా అనేది చూడాలంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన చేసిన ప్రసంగంలో వెలువడ్డాయి.
కొన్ని రాజకీయ పార్టీలు అభివృద్ధిని విస్మరించి అవినీతికి పాల్పడుతూ, పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికే పరిమితమవుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతికి తావులేకుండా పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రజలు అవినీతిమయమైన పాలన కావాలా, అవినీతి రహిత పాలన కావాలా అనే విషయంపై ఆలోచించాలని ఆయన సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!