

బిగ్బాస్ తెలుగు 10 నాలుగో రోజు కంటెస్టెంట్లకు హౌస్మేట్ హోదా దక్కించుకునే అవకాశం వచ్చింది. మొదటి టాస్క్లో రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీ.. బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేష్ పాల్గొన్నారు. ఇచ్చిన ఆల్ఫాబెట్లను పేర్చి తమ టీమ్లోని ఎవరిని డేంజర్ జోన్లోకి పంపాలనుకుంటున్నారో వారి పేరును రూపొందించాల్సి ఉంటుంది. రెడ్ టీమ్ చైత్రా రాయ్ పేరును, బ్లూ టీమ్ కృష్ణుడు పేరును ఎంచుకుంది.
బ్లూ టీమ్ ముందుగా టాస్క్ పూర్తి చేసినప్పటికీ పేరును తప్పుగా స్పెల్ చేయడంతో రెడ్ టీమ్ విజయం సాధించింది. దీంతో రోహిత్, వంశీ హౌస్మేట్స్గా మారినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. ఆ వెంటనే షాలినీ ‘మ్యూజిక్ ప్లీజ్’ అంటూ సెలబ్రేషన్ కోసం పాట అడగడంతో చైత్రా రాయ్ అసహనం వ్యక్తం చేసింది. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకే పాట అడిగామని షాలినీ చెప్పినా, చైత్రా ఆమెను సింపతీ గేమ్ ఆడొద్దంటూ హెచ్చరించింది. దీంతో షాలినీ వెక్కి వెక్కి ఏడ్చింది. చైత్రా కూడా భావోద్వేగానికి గురైంది. మరోవైపు రోహిత్ విజయం త్రిగుణ్తో అతని మధ్య ఉన్న విభేదాలను మరింత పెంచుతుందా అనే ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!