
క్రీడలు

ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్లో భారత మహిళల జట్టు రెండో రౌండ్కు అర్హత సాధించింది. గురువారం పూల్-డి చివరి మ్యాచ్లో ఇంగ్లండ్తో భారత్ 0-0తో డ్రా చేసుకుంది. ఈ ఫలితంతో భారత్ ఐదు పాయింట్లతో గ్రూప్లో రెండో స్థానంలో నిలిచి తదుపరి దశకు చేరుకుంది. తొలి మ్యాచ్లో చైనాతో 2-2తో డ్రా చేసుకున్న భారత్, ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై 6-1తో ఘన విజయం సాధించింది.
చైనా ఏడు పాయింట్లతో పూల్-డి టాపర్గా నిలిచింది. భారత్ రెండో స్థానంతో ముందంజ వేయగా, ఇంగ్లండ్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్పై మ్యాచ్లో భారత రక్షణ విభాగం కీలకంగా రాణించి ప్రత్యర్థికి గోల్స్ దక్కకుండా అడ్డుకుంది. చివరి నిమిషాల్లో ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడి తెచ్చినా భారత జట్టు సమర్థంగా ఎదుర్కొని తదుపరి రౌండ్లో చోటు దక్కించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!