
క్రీడలు

TG 20 వేలంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడవుతున్నారు. వేలం ప్రారంభంలోనే ఐకాన్ ప్లేయర్లపై ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ నెలకొంది. తిలక్ వర్మ కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా చివరికి మెదక్ ఫాల్కన్స్ అతన్ని రూ.33 లక్షలకు దక్కించుకుంది.

ఇతర ఆటగాళ్లలో తన్మయ్ అగర్వాల్ను కరీంనగర్ డైమాండ్స్ రూ.8 లక్షలకు, రాహుల్ బుద్ధిని నల్గొండ నైట్స్ రూ.8 లక్షలకు కొనుగోలు చేశాయి. మహ్మద్ సిరాజ్ను వరంగల్ వారియర్స్ రూ.14 లక్షలకు దక్కించుకుంది. అజయేవ్, ప్రగ్యాన్ రెడ్డి వంటి ఆటగాళ్లు కూడా వివిధ ఫ్రాంచైజీలకు ఎంపికయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!