

భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను 2026 కామన్వెల్త్ గేమ్స్ కంటే సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆసియా క్రీడలపైనే తన పూర్తి దృష్టి ఉందని స్పష్టం చేసింది. ఆసియా క్రీడల్లో తొలి పతకం సాధించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపిన ఆమె, ఆ టోర్నీ కోసం శక్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కామన్వెల్త్ గేమ్స్లో వంద శాతం ప్రయత్నం చేయబోనని వెల్లడించింది. ఈసారి ఆమె 48 కేజీల విభాగంలో పోటీ పడనుంది.
ఆసియా క్రీడలకు రెండు నెలల కన్నా తక్కువ సమయం ఉండటంతో 90 కేజీల స్నాచ్ ప్రయత్నానికి దూరంగా ఉంటానని చాను తెలిపింది. లాస్ ఏంజెలెస్ 2028 ఒలింపిక్స్కు ముందు బరువు విభాగాల్లో జరిగిన మార్పుల నేపథ్యంలో ఆసియా క్రీడల అనంతరం 53 కిలోల విభాగంలోకి మారాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం, ప్రపంచ ఛాంపియన్షిప్లలో రెండు పతకాలు, కామన్వెల్త్ గేమ్స్లో రెండు స్వర్ణాలు సాధించిన చాను ఇప్పటికీ ఆసియా క్రీడల్లో తొలి పతకం కోసం ఎదురుచూస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!