

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలను సవరించింది. బ్యాంకులు డిపాజిట్ వడ్డీ రేట్లను ప్రకటించే విధానంలో మరింత పారదర్శకత, స్థిరత్వం తీసుకురావడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
రూ.3 కోట్లకు పైబడిన బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులకు ఇవి వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది. ఈ మార్పులు FD వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం కోసం కాదని స్పష్టం చేసింది.
బ్యాంకులు డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్ల వివరాలను తమ వెబ్సైట్లో ముందుగానే వెల్లడించాలి. ముఖ్యంగా బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రతి పనిదినం ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో ప్రచురించాలి. ఇందుకోసం ఉదయం 10.10 గంటల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
ఒకే తేదీన, ఒకే పరిమాణంలో ఉన్న డిపాజిట్లకు బ్యాంకులు అన్ని శాఖలు, ఖాతాదారులకు ఒకే విధమైన వడ్డీ రేటును అందించాలి. వడ్డీ చెల్లింపులో ఎలాంటి వివక్ష ఉండకూడదు. అయితే Liquidity Coverage Ratio నిబంధనల కింద వర్తించే డిఫరెన్షియల్ రన్-ఆఫ్ రేట్ల ఆధారంగా బల్క్ డిపాజిట్లకు వేర్వేరు వడ్డీ రేట్లను అందించే వెసులుబాటు బ్యాంకులకు ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!