

కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత ఈక్విటీల్లో అమ్మకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2025లో కొనసాగిన విక్రయాల ధోరణి 2026లోనూ కొనసాగడంతో, ఏప్రిల్–జూన్ త్రైమాసికం ముగిసే నాటికి ఎన్ఎస్ఈలో లిస్టైన కంపెనీల్లో ఎఫ్పీఐల వాటా 15.1 శాతానికి పడిపోయింది. ఇది 17 ఏళ్లలోనే కనిష్ఠ స్థాయి. 2026 జూన్ చివరి నాటికి ఎఫ్పీఐలు భారత ఈక్విటీల నుంచి నికరంగా రూ.2,30,752 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
మరోవైపు, దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్పీఐలకు భిన్నంగా పెట్టుబడులను పెంచుతున్నాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో దేశీయ మ్యూచువల్ ఫండ్స్ వాటా వరుసగా 12వ త్రైమాసికంలో పెరిగి 11.6 శాతానికి చేరుకుంది. ఇది సరికొత్త రికార్డు. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐలు) వాటా 19.5 శాతానికి బలపడింది. దీంతో ఎఫ్పీఐల కంటే డీఐఐలు వరుసగా ఏడో త్రైమాసికంలో అధిక వాటాను కొనసాగించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!