
జనరల్

వేదాంతా సంస్థ తన రాగి (కాపర్) మరియు నికెల్ వ్యాపారాలను కొత్తగా రీబ్రాండ్ చేసింది. ఇకపై రాగి సంబంధిత అన్ని కార్యకలాపాలు వేదాంతా కాపర్గా, నికెల్ వ్యాపారం వేదాంతా నికెల్గా కొనసాగుతాయని కంపెనీ ప్రకటించింది. స్టెరిలైట్ కాపర్, ఫుజైరా గోల్డ్, వీసీఐ వంటి విభాగాలు వేదాంతా కాపర్ కింద ఏకీకృతంగా పనిచేస్తాయి.
వేదాంతా కాపర్ వచ్చే ఏడాది చివరికి 460 కిలో టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వేదాంతా నికెల్ ప్రస్తుత 7 కిలో టన్నుల నుంచి 60 కిలో టన్నులకు ఉత్పత్తి పెంచాలని ప్రణాళిక వేసింది. వ్యాపారాలను ఒకే బ్రాండ్ కింద తీసుకురావడం ద్వారా సుస్థిర వృద్ధి సాధించవచ్చని కంపెనీ సీఈఓ పునీత్ ఖురానా తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!