

సనత్నగర్లో త్వరలో ప్రారంభంకానున్న టిమ్స్ (TIMS) ఆసుపత్రి కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) 180 మంది వైద్యులను డిప్యుటేషన్పై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులకు చెందిన 98 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు 82 మంది సీనియర్ రెసిడెంట్లు ఉన్నారు. వీరందరినీ జూన్ 18న రిలీవ్ చేసి, జూన్ 19 ఉదయానికల్లా టిమ్స్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.
అయితే కొత్త నియామకాలు చేపట్టకుండా ఇప్పటికే సేవలందిస్తున్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి నిపుణులను తరలించడంపై వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే నిపుణ వైద్యులు బదిలీ కావడంతో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రోగుల రద్దీ అధికంగా ఉన్న ఈ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!