
క్రీడలు

తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఆహార, నీటి విశ్లేషణ కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ కేంద్రాన్ని సందర్శించిన ఆయన తొలి విశ్లేషణ నివేదికను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది మార్చి 21న ప్రారంభించిన ఈ కేంద్రం రెండున్నర నెలల్లోనే అన్ని ప్రమాణాలను పూర్తి చేసి సేవలు ప్రారంభించడం విశేషమని తెలిపారు.
ఈ కేంద్రంలో 50కు పైగా ఆధునిక పరికరాలు ఉండగా, 30 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ తిరుమలలోని వంటశాలలు, అన్నప్రసాద కేంద్రాలు, లడ్డూ ప్రసాదం, హోటళ్ల నుంచి 40 ఆహార నమూనాలు, 20 నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలో 20 మంది శాశ్వత ఉద్యోగులను నియమించనున్నట్లు అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!