

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ₹2,059.81 కోట్ల పీఎం ఏక్తా మాల్ ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాయదుర్గ్లోని 6.30 ఎకరాల విలువైన ప్రజా భూమి, సుమారు ₹202 కోట్ల కేంద్ర నిధులు వినియోగిస్తున్నప్పటికీ ప్రైవేటు డెవలపర్కు అధిక ప్రయోజనం కలిగేలా టెండర్ నిబంధనలు రూపొందించారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్కు లేఖ రాసినట్లు వెల్లడించారు.
ప్రభుత్వానికి కేటాయించే స్థలం కంటే ప్రైవేటు సంస్థకు రెట్టింపు కన్స్ట్రక్షన్ హక్కులు ఇవ్వడం, ₹200 కోట్ల వడ్డీలేని సాస్కి లోన్ను కూడా ప్రైవేటు డెవలపర్కు మళ్లించేలా నిబంధనలు ఉన్నాయని ఆరోపించారు. టెండర్ను వెంటనే రద్దు చేసి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో అమృత్ టెండర్లు, బొగ్గు స్కామ్లపై చేసిన ఫిర్యాదులపై కూడా కేంద్రం స్పందించాలని కోరుతూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!