
జనరల్

ఒడిశాలోని చండీపూర్ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రయోగం నిర్దేశించిన అన్ని లక్ష్యాలను విజయవంతంగా చేరుకున్నట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్షతో దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైందని అధికారులు తెలిపారు.
క్షిపణి ప్రయోగానికి ముందు భద్రతా చర్యల్లో భాగంగా 3,000 కిలోమీటర్లకు పైగా పరిధిలో నోటామ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్స్) ఆంక్షలు విధించారు. అగ్ని-4 విజయవంతమైన పరీక్ష భారత క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని, దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఇది కీలక అడుగని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!