

ప్రధాని నరేంద్ర మోదీ సైబర్ మోసాలు, ‘డిజిటల్ అరెస్ట్’ కేసులపై సమీక్ష నిర్వహించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, యువతతో పాటు సైబర్ మోసాలకు సులభంగా గురయ్యే ఇతర వర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. మోసాలకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను గుర్తించడం, సురక్షితమైన డిజిటల్ పద్ధతులను పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని పేర్కొన్నారు.
మారుతున్న సైబర్ నేరాల విధానాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధిత సిబ్బందికి క్రమం తప్పకుండా శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని మోదీ సూచించారు. కొత్త తరహా డిజిటల్ మోసాలను వేగంగా గుర్తించి, సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిబ్బందిని సిద్ధం చేయాలని అన్నారు. సైబర్ భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు, నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!