

అమరావతిలో నేడు జరగనున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు భవనాల సమీపంలో రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఆమోదం లభించే అవకాశముంది. అలాగే ఏపీ సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు, అమరావతి ఎకనామిక్ రీజియన్కు ఆమోదం, సీఆర్డీఏ అగ్నిమాపక విభాగం ఏర్పాటు వంటి అంశాలు కేబినెట్ ఎజెండాలో ఉన్నట్లు సమాచారం.
రాజధాని ప్రాంత అభివృద్ధికి ఊతమిచ్చే పలు ప్రాజెక్టులపైనా కేబినెట్ దృష్టి సారించనుంది. అమరావతిలో పర్యాటక అభివృద్ధి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటు, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టడం, గ్రామకంఠంలో ఐదు సెంట్ల వరకు భూమి కేటాయింపు వంటి ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదనంగా ఇళ్ల స్థలాల పంపిణీ, వివిధ సంస్థలకు భూకేటాయింపులపై కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!