
జనరల్

ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేటి నుంచి అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాల్తాల్ మరియు పహల్గాం మార్గాల నుంచి యాత్రను నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇప్పటివరకు సుమారు 3.7 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని యాత్రికులకు విజ్ఞప్తి చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!