

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి రెండో బోర్డు పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 2026 నుంచి పదో తరగతిలో రెండు బోర్డు పరీక్షల విధానాన్ని సీబీఎస్ఈ అమలు చేస్తోంది. ప్రధాన బోర్డు పరీక్ష ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరగగా, రెండో బోర్డు పరీక్ష మే 15 నుంచి 21 వరకు నిర్వహించారు. మొత్తం 6,64,027 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 6,63,777 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 5,13,955 మంది మార్కుల మెరుగుదల కోసం పరీక్ష రాశారు.
రెండో బోర్డు పరీక్షలో 59.95 శాతం మంది అంటే 3,08,095 మంది విద్యార్థులు ప్రధాన పరీక్షతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించారు. కంపార్ట్మెంట్ విభాగంలో 1,49,822 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 78,503 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండు బోర్డు పరీక్షల ఫలితాలను కలిపి చూస్తే పదో తరగతిలో మొత్తం 96.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!