

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026కు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సింగపూర్లో నిర్వహించిన సీఐఐ పార్టనర్షిప్ సమిట్ బిజినెస్ రోడ్షోలో పాల్గొన్న ఆయన, ప్రతి పెట్టుబడిదారు కనీసం ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో సదస్సుకు రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, వేగవంతమైన అనుమతులు, పారదర్శక పాలన, విశ్వసనీయతను స్వయంగా పరిశీలించాలని సూచించారు.
రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్, అర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం, స్టార్టప్ ఎకోసిస్టమ్ వంటి అవకాశాలను ఆయన ప్రస్తావించారు. అమరావతిని ప్రపంచ స్థాయి ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సింగపూర్తో ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసిన సీఎం, అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో సింగపూర్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడమే లక్ష్యమని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!