
ఓటీటీ

శబరిమలలో ఆగస్టు 2, 3 తేదీల్లో జరిగే నిరపుత్తరి దర్శనం కోసం వెళ్లాలని భావిస్తున్న భక్తులకు ట్రావన్కోర్ దేవస్వం బోర్డు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. పంపా ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున భక్తులు తమ ప్రయాణాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం భద్రతా హెచ్చరిక అమల్లో ఉన్నందున అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని బోర్డు కోరింది. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అనవసర ప్రయాణాలను నివారించాలని భక్తులకు సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!