

ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరు ఆగస్టు 2న జాంబియాలోని లుసాకా లోటస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. ఇండియన్ రాయల్స్ మరియు పాకిస్థాన్ పాంథర్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ తో పాటు ఫ్యాన్కోడ్ యాప్, వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు.
శిఖర్ ధావన్ సారథ్యంలో ఇండియన్ రాయల్స్ జట్టులో దినేష్ కార్తీక్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, అంబటి రాయుడు వంటి దిగ్గజాలు ఉన్నారు. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ టైగర్స్పై 19 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మరోవైపు మహమ్మద్ హఫీజ్ నేతృత్వంలోని పాకిస్థాన్ పాంథర్స్ తమ తొలి మ్యాచ్లో ఏషియన్ స్టార్స్ చేతిలో 85 పరుగుల తేడాతో ఓడిపోయి, ఈ మ్యాచ్లో తిరిగి విజయపథంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూలై 30 నుంచి ఆగస్టు 10 వరకు ఈ టోర్నీలో మొత్తం 19 టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!