
రాజకీయాలు

తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో మరో కీలక బదిలీ చేపట్టింది. బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సతీమణి, సీనియర్ అధికారిణి లక్ష్మీభాయిని ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉన్న ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు లక్ష్మీభాయి త్వరలోనే హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో భాగంగానే ఈ కీలక పరిపాలనా మార్పు జరిగినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!