

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దేశంలో అత్యంత పాపులర్ సెలబ్రిటీ కపుల్స్లో ఒకరు. తమ కెరీర్ కారణంగా ఎప్పుడూ మీడియా, అభిమానుల దృష్టిలో ఉండే ఈ జంట.. పిల్లలకు మాత్రం సాధారణమైన, ప్రశాంతమైన బాల్యాన్ని అందించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లండన్లో కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం వారికి అనుకూలంగా మారిందని సమాచారం. అక్కడ మీడియా హడావుడి తక్కువగా ఉండటంతో కుటుంబానికి వ్యక్తిగత సమయం దొరుకుతోంది.
డాక్టర్ శ్రీరామ్ నేనే ఇటీవల అనుష్క, విరాట్ కుటుంబ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. పిల్లలు నిరంతరం కెమెరాలు, మీడియా నిఘా మధ్య కాకుండా సాధారణ పిల్లల్లా పెరగాలన్నదే వారి ఆలోచనగా తెలుస్తోంది. లండన్లో పార్కులకు వెళ్లడం, రోజువారీ పనులను సాధారణంగా చేసుకోవడం వంటి చిన్న చిన్న అనుభవాలను కుటుంబం ప్రశాంతంగా ఆస్వాదించగలుగుతోంది. ఎంతటి స్టార్డమ్ ఉన్నా పిల్లల గోప్యత, కుటుంబ సంక్షేమానికే వారు ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!