

చేపల వేటకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చెందిన రెండు బోట్లు వేర్వేరు ప్రాంతాల్లో గల్లంతయ్యాయి. ఒక బోటు ఒడిశాలోని పూరీ సమీపంలో చిక్కుకోగా, మరో బోటు విశాఖపట్నానికి 10 నాటికల్ మైళ్ల దూరంలో ఇబ్బందులకు గురైంది. ఈ రెండు బోట్లలో మొత్తం 16 మంది మత్స్యకారులు ఉండగా, వారిలో ఎక్కువ మంది విజయనగరం జిల్లాకు చెందినవారే.
పూరీ తీరానికి తొమ్మిది మంది మత్స్యకారులు సురక్షితంగా చేరుకోగా, చిన్నా అనే మత్స్యకారుడిని చైనా కార్గో నౌక రక్షించింది. రక్షించబడిన మత్స్యకారులంతా క్షేమంగా ఉన్నారని, వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ఇంకా గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం భారత కోస్ట్గార్డు, నేవీ, మెరైన్ పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మత్స్యకారులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఒడిశా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!