

2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే ప్రధాన లక్ష్యమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు తెలిపారు. శుక్రవారం మంగళగిరి అరణ్యభవన్లో కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 22.96 శాతంగా ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఏపీ గ్రీన్ కార్యక్రమం ద్వారా అడవులకే పరిమితం కాకుండా వ్యవసాయ భూములు, గ్రామాలు, పట్టణాలు, ప్రధాన రహదారుల వెంట, కాలువ గట్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాలు, పరిశ్రమల పరిసరాలు, అనుకూలమైన బంజరు భూముల్లో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, తోటల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణను ప్రజల భాగస్వామ్య ఉద్యమంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!