

ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మౌలిక వసతుల కల్పనకు మొత్తం ₹7,469.46 కోట్లతో చేపట్టనున్న పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, వీధి దీపాలు, రోడ్ మీడియన్ల సుందరీకరణ వంటి పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు.
పట్టణాల్లో 100 శాతం రోడ్డు అనుసంధానం లక్ష్యంగా 4,388 కి.మీ రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి ₹4,655.82 కోట్లు కేటాయించారు. డ్రైనేజీ వ్యవస్థతో కూడిన రోడ్ల కోసం ₹509.12 కోట్లు, 541 కొత్త పార్కుల అభివృద్ధికి ₹247.28 కోట్లు, 20,340 కొత్త వీధి దీపాల ఏర్పాటుకు ₹87.78 కోట్లు కేటాయించారు. అలాగే 1,186 కి.మీ రోడ్డు మీడియన్లను సుందరీకరించనున్నారు. ఈ పనులతో పట్టణాల్లో రాకపోకలు, పారిశుద్ధ్యం, వెలుతురు, పచ్చదనం, ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులు మెరుగుపడే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!