
జనరల్

విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వంద దేవుళ్లు’ థియేటర్లలో ప్రదర్శన ముగించుకుని ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. భావోద్వేగభరితమైన కథ, సమాజానికి ఉపయోగపడే సందేశంతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఓటీటీ వేదికపై ఈ సినిమాకు మరింత ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ‘వంద దేవుళ్లు’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ZEE5 సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ససి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్వాసిక, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి కీలక పాత్రలు పోషించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించగా, బాలాజీ శ్రీరామ్ సంగీతాన్ని అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!