
జనరల్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ జూలై 24న తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 50(3) ప్రకారం స్పీకర్కు రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన పదవీకాలం 2028 ఏప్రిల్ వరకు కొనసాగాల్సి ఉండగా, మధ్యలోనే వైదొలిగారు.
తన రాజీనామా లేఖలో గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, గతంలో బైపాస్ శస్త్రచికిత్స, తాజాగా ఆటోనామిక్ న్యూరోపతి నిర్ధారణతో దీర్ఘకాలిక చికిత్స అవసరమైందని పేర్కొన్నారు. అలాగే 2024 ఆగస్టు రాజకీయ సంక్షోభం అనంతరం దేశాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించడంలో తన పాత్రను సమర్థించుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!