

సోషల్ మీడియా ప్రభావం ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా మార్చగలదో చెప్పేందుకు బిహార్కు చెందిన ఓ యూట్యూబర్కు సంబంధించిన వైరల్ కథనం ఉదాహరణగా నిలుస్తోంది. నివేదికల ప్రకారం.. నెలకు సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదించే ఈ యూట్యూబర్ దాదాపు రూ.10 లక్షల ఖర్చుతో ఘనంగా వివాహ వేడుక నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సుమారు రూ.4 లక్షల విలువైన రెండు కొత్త ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫోన్లు కొనుగోలు చేసి, అందులో ఒకదాన్ని తన భార్యకు బహుమతిగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ కథనం వైరల్ కావడంతో డిజిటల్ క్రియేటర్లకు సోషల్ మీడియా ద్వారా లభించే అదనపు ఆదాయంపై చర్చ మొదలైంది. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంతో పాటు స్థానిక బ్రాండ్ ప్రమోషన్లు, స్పాన్సర్షిప్లు, పెయిడ్ కొలాబరేషన్లు, ఆన్లైన్ కమ్యూనిటీ మద్దతు వంటి మార్గాల ద్వారా కూడా క్రియేటర్లు ఆదాయం పొందే అవకాశం ఉంది. అయితే ఈ వైరల్ కథనంలో పేర్కొన్న ఆదాయం, పెళ్లి ఖర్చు, ఫోన్ల ధరలకు స్వతంత్రంగా ధృవీకరణ లభించలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!