

హైదరాబాద్లో జరగనున్న గణేశ్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, హైడ్రా కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కలిసి ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలాపూర్ మండపం నుంచి సాగే ప్రధాన శోభాయాత్ర మార్గాన్ని బస్సు యాత్ర ద్వారా పరిశీలించి క్షేత్రస్థాయి ఏర్పాట్లను సమీక్షించారు.
బాలాపూర్ నుంచి సాగే ప్రధాన శోభాయాత్ర మార్గం దాదాపు 19 కిలోమీటర్ల మేర ఉంటుంది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దాదాపు 20 వేల మంది సిబ్బందితో బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర సీసీటీవీ నిఘా కొనసాగించనున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా విజయవంతం కావడానికి మండప నిర్వాహకులు, నగర ప్రజలు హైదరాబాద్ సిటీ పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!