
ఆరోగ్యం

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ కేబినెట్ సమావేశాలను పేపర్లెస్ విధానంలో నిర్వహించేందుకు డిజిటల్ కేబినెట్ విధానాన్ని ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తాజా సమావేశంతో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులకు ఐప్యాడ్లు అందజేశారు. ఇకపై కేబినెట్ ఎజెండా, నోట్స్ అన్నీ ఈ–బుక్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఇది వేగవంతమైన, పారదర్శక పాలనకు దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.
కేబినెట్ నిర్ణయాలను రియల్ టైమ్లో ట్రాక్ చేయడం, ఫాలోఅప్ చేయడం ఈ వ్యవస్థ ద్వారా సులభమవుతుందని పేర్కొన్నారు. జీఏడీ ద్వారా ఎజెండా తయారుచేసి డిజిటల్గా పంపిస్తారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!