

వాట్సాప్లో ప్రవేశపెట్టనున్న యూజర్నేమ్ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ, అప్పటి వరకు భారతీయ వినియోగదారులకు ఈ ఫీచర్ను అమలు చేయవద్దని సూచించింది. ఈ అంశంపై అన్ని సంప్రదింపులు పూర్తయ్యాకే తదుపరి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఫోన్ నంబర్ను వెల్లడించకుండా చాట్ చేసేందుకు వాట్సాప్ ఈ యూజర్నేమ్ సదుపాయాన్ని తీసుకురానుంది. ఇందులో 3 నుంచి 35 అక్షరాల వరకు యూజర్నేమ్ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రముఖులు లేదా అత్యున్నత వ్యక్తుల పేర్లను అనుమతించబోమని సంస్థ తెలిపింది. పెద్ద గ్రూపుల్లో కూడా ఫోన్ నంబర్ గోప్యంగా ఉండటమే ఈ ఫీచర్ లక్ష్యమని వాట్సాప్ పేర్కొంది.
అయితే ఈ ఫీచర్ దుర్వినియోగానికి అవకాశం ఉందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నమ్మకమైన వ్యక్తుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. స్పామ్ సందేశాలు, ఆన్లైన్ మోసాలు పెరిగే ప్రమాదం నేపథ్యంలో పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మెటాను కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!