
సినిమాలు

లోక్సభ సీట్లను 50 శాతం పెంచే డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ఫార్ములాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగితే అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కొత్త కసరత్తు చేస్తోంది.
గతంలో ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపక్షాల వ్యతిరేకతతో ముందుకు సాగకపోవడంతో, మరింత బలమైన బిల్లును తీసుకురావాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని మార్చకుండా డీలిమిటేషన్ చేయాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఎన్డీయేకు లోక్సభలో 300కి పైగా సీట్లు ఉండగా, మూడింట రెండొంతుల మెజారిటీ కోసం 360 సీట్ల మద్దతు అవసరమని అంచనా.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!