
గాసిప్స్

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. కూటమిగా తొలిసారి స్థానిక ఎన్నికలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో సమన్వయం, అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అభ్యర్థుల ఎంపికలో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. అవసరమైతే బీసీలకు మరిన్ని సీట్లు కేటాయిస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కోర్టులో న్యాయపోరాటం చేయాలని, తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!