

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాలపై ఎలాంటి ఏకాభిప్రాయం లేకుండానే ముగిసింది. ఎల్ నినో ప్రభావం ఉన్నందున తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 50:50 నిష్పత్తిలో నీటిని పంచాలని తెలంగాణ ఈఎన్సీ రమేష్ బాబు కోరారు. పోతిరెడ్డిపాడు, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా ఏపీ నీటిని తీసుకుంటున్న తీరుపైనా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
మరోవైపు 66:34 నిష్పత్తిలోనే నీటి విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి కోరారు. వచ్చే ఆగస్టు వరకు 104 టీఎంసీల నీరు అవసరమని ఏపీ కోరగా, తెలంగాణ ప్రతిపాదించిన 200 టీఎంసీల డిమాండ్ సహేతుకం కాదని ఏపీ పేర్కొంది. రాయలసీమతో పాటు మార్కాపురం, పల్నాడు తదితర ప్రాంతాల తాగునీటి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఈ అంశాలపై సెప్టెంబర్ నాలుగో వారంలో జరిగే పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!