
జనరల్

సాయికృష్ణ కేసు దర్యాప్తులో భాగంగా సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరుసగా ఏడో రోజు విచారించనుంది. నేటితో ఆయన వారం రోజుల పోలీసు కస్టడీ ముగియనుండగా, విచారణ అనంతరం మధ్యాహ్నం విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు ప్రక్రియ అనంతరం ఆయనను తిరిగి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించనున్నారు.
ఈ కేసులో కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యలను నేటి నుంచి ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై వారిని సిట్ ప్రశ్నించనుంది. ఇప్పటివరకు సీఐ నాగరాజు విచారణలో ఎలాంటి కీలక సమాధానాలు ఇవ్వలేదని సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!