

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) నిరసనలకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి నిరసనకారుల పట్ల అధికారులు అత్యంత సంయమనంతో వ్యవహరించాలని, హింసను అదుపు చేసే క్రమంలో పోలీసు బలగాలు కూడా అతిగా స్పందిస్తే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన నిరసనల్లో రాళ్లదాడులు, హింస, ఆస్తి నష్టం జరిగినందుకు సీజేపీని బాధ్యులను చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఇతర విద్యార్థి ఆందోళనలకు సంబంధించిన పిటిషన్లతో సుప్రీంకోర్టు జతచేసింది. యువత ఎందుకు ఆందోళన చేస్తున్నారో ఓపికగా వినడమే సమస్యలకు ఉత్తమ పరిష్కారమని సీజేఐ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర వర్గాల సమాధానాలు పరిశీలించిన అనంతరం తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!