

రాజమండ్రిలో ఆగస్టు 3న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మెడికో ప్రియాంక ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం అనంతరం ప్రియాంకకు రాజమండ్రిలో చికిత్స అందించగా, మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్కు తరలించిన విషయాన్ని అధికారులు సీఎంకు వివరించారు.
ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారని ఎస్పీ సీఎంకు తెలిపారు. నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న వారిపై చట్టపరంగా కఠిన సెక్షన్లు నమోదు చేసి, తగిన శిక్ష పడేలా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలని సూచించిన సీఎం, కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!