

ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రతి నెల తొలి తేదీన జీతాలు అందిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఈరోజు జీతాలు వారి ఖాతాల్లో జమయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ జీతాల విడుదల ప్రక్రియను పూర్తి చేసింది.
జీతాల చెల్లింపులో జాప్యం వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి నెలా రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హానరేరియం సిబ్బందికి కూడా ఆలస్యం లేకుండా జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అనుగుణంగా ప్రతి నెల 25వ తేదీలోగా జీతాల బిల్లులు సమర్పించి, నెల చివరి పని దినానికల్లా పరిశీలన, ఆడిట్, అనుమతి ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. బిల్లులు సమర్పించిన అన్ని విభాగాల ఉద్యోగులకు ఈరోజు జీతాలు జమ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!