

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన కీలక జాతీయ రహదారుల ప్రాజెక్టులు, ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) పురోగతిపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు జాతీయ రహదారి ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (నార్త్ పార్ట్) పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (సదర్న్ పార్ట్)కు కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!