
జనరల్

మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక లడ్కీ బహీన్ పథకం ఈ-కేవైసీ ధృవీకరణ అనంతరం వివాదంలో చిక్కుకుంది. ధృవీకరణ ప్రక్రియలో అనర్హులను గుర్తించి తొలగించినట్లు అధికారులు వెల్లడించగా, మొత్తం 93 లక్షల మంది లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించారు. దీంతో పథకం కింద లబ్ధి పొందుతున్న మహిళల సంఖ్య 2.47 కోట్ల నుంచి 1.70 కోట్లకు తగ్గింది.
అయితే అర్హులైన మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఎన్నికల తర్వాత మహిళలను మోసం చేశారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!