
సినిమాలు

2026లో నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణను ఆతిథ్య రాష్ట్రంగా ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం సహకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను క్రీడారంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!