

1993 ముంబయి వరుస పేలుళ్ల కేసు తీర్పు వెలువడిన సమయంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తీవ్ర భయాందోళనలకు గురయ్యారని అప్పటి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ వెల్లడించారు. ఆర్మ్స్ యాక్ట్ కింద కోర్టు సంజయ్ దత్ను దోషిగా తేల్చి తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించిన సమయంలో ఆయన భయంతో వణికిపోయారని ఓ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. తీర్పు అనంతరం సంజయ్ దత్ తనకు ఎలాంటి తప్పు చేయలేదని భావోద్వేగంతో చెప్పారని నికమ్ గుర్తుచేశారు.
ఈ కేసులో సంజయ్ దత్కు ‘ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్’ కింద ఉపశమనం ఇవ్వకూడదని తాను గట్టిగా వాదించినట్లు నికమ్ వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడి నుంచి ఆయుధాన్ని పొందిన విషయం తెలిసినప్పటికీ దానిని ఉంచుకున్నందున చట్టపరమైన రాయితీకి అర్హుడు కాదని కోర్టుకు వివరించినట్లు చెప్పారు. ప్రాసిక్యూషన్ ఏడేళ్ల జైలు శిక్షను కోరగా, సుప్రీంకోర్టు చివరకు ఐదేళ్ల శిక్ష విధించిందని తెలిపారు. తీర్పు అనంతరం మీడియా ముందున్నందున ధైర్యంగా నిలబడాలని తాను సంజయ్ దత్కు సూచించిన విషయాన్ని కూడా వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!