
జనరల్

ఈ నెల 9న కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. పన్ను మినహాయింపు పొందే విరాళాల కోసం 3,260 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను ఉపయోగించుకుని రూ.10,000 కోట్లకు పైగా నల్లధనం సృష్టించారని ఆరోపించింది. ఈ పార్టీలను మధ్యవర్తులుగా ఉపయోగించి, విరాళాల నుంచి 2 శాతం నుంచి 15 శాతం వరకు కమీషన్ మినహాయించిన తర్వాత మిగిలిన నగదును దాతలకు తిరిగి ఇచ్చేవారని కాంగ్రెస్ పేర్కొంది.
ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత శక్తిసింహ్ గోహిల్ డిమాండ్ చేశారు. ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు, జరిమానాలు విధించేందుకు ఇప్పటికే నిబంధనలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!