

నటి జాన్వీ కపూర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో తన పేరుతో ఉన్న ఫ్యాన్ క్లబ్లు, అభిమానుల పేజీలపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కోర్టు నిరాకరించింది. జాన్వీపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ఆన్లైన్ దూషణలతో పాటు డీప్ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా అశ్లీల కంటెంట్ రూపొందించి ప్రచారం చేస్తున్నారని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన పలు ఫ్యాన్ పేజీలతో పాటు సుమారు 4,000 వెబ్సైట్ లింక్లను కూడా సమర్పించారు.
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా అన్ని ఫ్యాన్ పేజీలను చట్టవిరుద్ధమైనవిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘అశ్లీలత లేదా తీవ్రమైన అభ్యంతరకర కంటెంట్ ఉంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ అన్ని ఫ్యాన్ క్లబ్లను ఎలా మూసివేయగలం?’’ అని ప్రశ్నించింది. కొన్ని పేజీలు కేవలం అభిమానంతోనే ఏర్పాటు చేసి ఉండొచ్చని, అందువల్ల వాటన్నింటినీ నిషేధించడం సరికాదని అభిప్రాయపడింది. ‘‘మీకు అభిమానులు వద్దా?’’ అని కూడా కోర్టు ప్రశ్నించింది. చట్టాన్ని ఉల్లంఘించే నిర్దిష్ట కంటెంట్పై చర్యలు తీసుకోవచ్చని, అయితే అన్ని అభిమానుల పేజీలను ఒకే గాటన కట్టలేమని పేర్కొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!