
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పచ్చదనం 50 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రతిపాదించిన ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జూలై 3 నాటికి అన్ని ప్రక్రియలు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కి అనుగుణంగా అన్ని నిబంధనలు ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.
సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. సాధ్యం కాకపోతే 3–4 పంచాయతీలను క్లస్టర్గా చేసి ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని కూడా సూచించారు. కేంద్ర పథకాలతో అనుసంధానం చేసి గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!