
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ ఆరోగ్యం కోసం అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించి, నిరంజన్ తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న కాల పూజల్లో పాల్గొన్నారు.
నిరంజన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమను ఆలయంలో పూజలు చేయించి అనంతరం అతని తల్లిదండ్రులకు అందజేశారు. ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వచనాలు అందించగా, ఆలయ ప్రాంగణంలోని నూతన ధ్వజస్థంభానికి మొక్కులు చెల్లించి తన పర్యటనను ముగించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!