
రాజకీయాలు

విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఆలయ రాజగోపురం సమీపంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సమాచారం ప్రకారం, ఆలయ ఛైర్మన్, పాలక మండలి సభ్యుల కార్యాలయాల ఎదుట కూడా ఆమె రీల్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా వీడియోలు చిత్రీకరించడం భద్రతా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం అయ్యేలా చేసింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నిఘా, భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు, అధికారులు కోరుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!