

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) ప్రతినిధుల సమావేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. సంక్షేమం, అభివృద్ధిని సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తూ తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కింద రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, వచ్చే ఐదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని భట్టి పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యార్థులకు పోషకాహార పథకాలు, ఆక్రమణల నియంత్రణకు హైడ్రా, మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!