
జనరల్

మిర్యాలగూడ పట్టణంలో గత కొంతకాలంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర మంత్రుల సమక్షంలో అర్హులైన లబ్ధిదారులకు త్వరలో ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆయన ఇళ్ల సముదాయాన్ని పరిశీలించారు.
గత ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించినప్పటికీ మౌలిక వసతులు లేకుండా పనులు నిలిచిపోయాయని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక నిధులతో తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి అన్ని సదుపాయాలు పూర్తయ్యాయని తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!